Monsoon: రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణమే
రాబోయే రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణంగానే ఉంటుందని..
అంచనా వేసిన భారత వాతావరణ శాఖ
దిల్లీ: రాబోయే రెండు నెలల్లో నైరుతి రుతుపవనాల పనితీరు సాధారణంగానే ఉంటుందని భారత వాతావరణ శాఖ (ఐఎమ్డీ) అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరులో సగటు వర్షపాతం 95-105 శాతం ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈ సమయంలో దేశవ్యాప్తంగా 428.3 మిమీ వర్షపాతం రానుందని పేర్కొంది. దేశమంతటా ఆగస్టు నెలలో వర్షపాతం 94-106 శాతం మేర సాధారణంగానే ఉంటుందని తెలిపింది. ఈ పరిస్థితుల వల్ల వచ్చే ఖరీఫ్ పంటకు ఈ వాతావరణం అనుకూలంగా ఉంటుందని వెల్లడించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జులై-ఆగస్టు నెలల్లో అత్యధిక వర్షం పడుతుంది. జులై మధ్యలో దేశవ్యాప్తంగా భారీగా వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ