Andhra News: మే 5న ఐదు మండల పరిషత్‌లకు అధ్యక్ష ఎన్నికలు: ఎస్‌ఈసీ

ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లోని 5 వేర్వేరు మండల పరిషత్‌లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం

Published : 29 Apr 2022 20:41 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని 5 జిల్లాల్లోని 5 వేర్వేరు మండల పరిషత్‌లకు అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, కృష్ణా జిల్లా ఉంగుటూరు, పల్నాడు జిల్లాలోని పెదకూరపాడు, నెల్లూరు జిల్లా పొదలకూరు మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్‌ జారీ చేశారు. కోనసీమ జిల్లా రాయవరం మండల పరిషత్‌కు ఇద్దరు ఉపాధ్యక్షుల ఎన్నికకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. మే 5న ఉదయం 11గంటలకు మండల పరిషత్‌ల అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నీలం సాహ్ని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. 13 జిల్లాల్లోని 26 మండలాల పరిధిలో ఉన్న 26 గ్రామపంచాయతీ ఉప సర్పంచ్‌ల ఎన్నికకు ఎస్‌ఈసీ మరో నోటిఫికేషన్‌ ఇచ్చారు. మే 5వ తేదీ ఉదయం 11 గంటలకు ఉప సర్పంచ్‌ ఎన్నిక నిర్వహించనున్నట్టు ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌లో స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని