కాడెద్దులకు ఒకరోజు సెలవు.. ఎక్కడో తెలుసా?
ప్రస్తుత కాలంలో పొలం పనులు చేయటానికి ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నా, దుక్కి దున్నటంలో బీద రైతులకు దన్నుగా నిలుస్తున్నవి ఎద్దులే. అవి రైతన్నలకు నేస్తాలని చెబుతుంటారు. ఎందుకంటే అలుపెరుగకుండా పనిచేస్తాయి మరి. అందుకే వాటికీ వారంలో ఓ రోజు సెలవు నిద్దామనుకున్నారు ఆ ప్రాంతం ప్రజలు.
కర్నూలు : ప్రస్తుత కాలంలో పొలం పనులు చేయటానికి ట్రాక్టర్లను విరివిగా ఉపయోగిస్తున్నా, దుక్కి దున్నటంలో బీద రైతులకు దన్నుగా నిలుస్తున్నవి ఎద్దులే. అవి రైతన్నలకు నేస్తాలని చెబుతుంటారు. ఎందుకంటే అలుపెరగకుండా పనిచేస్తాయి మరి. అందుకే వాటికీ వారంలో ఓ రోజు సెలవు నిద్దామనుకున్నారు ఆ ప్రాంతం ప్రజలు. అదేంటి ఎద్దులకు సెలవు ఇవ్వటేమేంటీ అని అనుకుంటున్నారా? అవును నిజమే. విశ్రాంతి లేకుండా పనిచేస్తే మనమే కాదు జంతువులూ అలసిపోతాయి. మనమైతే విశ్రాంతి తీసుకుంటాం మరి వాటికి అక్కర్లేదా చెప్పండి... మరి విధానం అనుసరిస్తున్న ఆ ప్రాంతం ఎక్కడుందో? వారు ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారో తెలుసుకుందామా?
కర్నూలు జిల్లా హాలహర్వీ మండల పరిధిలోని విరుపాపురం, బలుగోట గ్రామాల్లో కాడెద్దులకు సోమవారం సెలవు ఇస్తారు. ఆ రోజు వాటితో ఎలాంటి పనులు చేయించరు. ఎంత అవసరం ఉన్నా సెలవు మాత్రం తప్పనిసరిగా ఇస్తారు. ఎద్దుల్ని ఇళ్లవద్దే కట్టేస్తారు. అంతేకాదు ఆరోజు ఉదయాన్నే ఎనిమిది గంటలలోపు వాటిని శుభ్రంగా కడిగి, బొట్లు పెట్టి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం బలుగోటలోని బసవేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు.
ఎద్దులకు ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తినపుడు, కొత్త ఎద్దులు కొనుగోలు చేసినపుడు బలుగోట బసవేశ్వర స్వామి ఆలయంలో మొక్కులు చెల్లిస్తే సమస్యలు తీరుతాయని ఇక్కడి వారి నమ్మకం. ఈ ఆచారం కొన్ని వందల ఏళ్ల నుంచి కొనసాగుతోంది. దేవరగట్టులోని బసలింగయ్య స్వామిని ఆస్పరి స్వామిగా పిలుస్తారు. శివ స్వరూపం బసవన్న అవతారంలో ఉందనీ.. ఎద్దులకు తప్పకుండా సోమవారం సెలవు ఇవ్వాలన్న స్వామి సూచన మేరకు అనాదిగా గ్రామ పెద్దలు ఈ పద్ధతి పాటిస్తున్నారు. బలుగోట, విరుపాపురంలలో ఆరువందల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడా నేటికీ కాడెద్దులతోనే వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామాల్లో సుమారు నాలుగు వందల జతలకు పైగా కాడెద్దులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434