పుణెలో అగ్నిప్రమాదం.. 500 దుకాణాలు దగ్ధం

మహారాష్ట్రలోని పుణెలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంజీ రోడ్‌లోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 500లకు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి....

Updated : 27 Mar 2021 12:09 IST

పుణె: మహారాష్ట్రలోని పుణెలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఎంజీ రోడ్‌లోని ఫ్యాషన్‌ స్ట్రీట్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోగా 500లకు పైగా దుకాణాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా మంటలు అంటుకుని పెద్దఎత్తున వ్యాపించాయి. దట్టమైన పొగలతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది 16 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కాగా ఈ ప్రమాదంలో శివకుమార్‌(28) అనే వ్యక్తి మృతిచెందినట్లు సమాచారం.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని