ఊబకాయులకు మద్యంతో మరింత ముప్పు!
మద్యం ఆరోగ్యానికి హానికరం అందరికీ తెలుసు. అయినా మద్యం సేవించేవాళ్లు ఆ అలవాటును అంత సులువుగా మానుకోలేరు. తక్కువ మోతాదులో తాగే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, విపరీతంగా మద్యం సేవించేవాళ్లలో కాలేయం దెబ్బతిని.. క్రమంగా ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. అయితే, మద్యం ప్రియుల్లో
ఇంటర్నెట్ డెస్క్: మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని అందరికీ తెలుసు. అయినా మద్యం సేవించేవాళ్లు ఆ అలవాటును అంత సులువుగా మానుకోలేరు. తక్కువ మోతాదులో తాగే వారికి పెద్దగా ఇబ్బందులు ఉండవు. కానీ, విపరీతంగా మద్యం సేవించేవాళ్లలో కాలేయం దెబ్బతిని.. క్రమంగా ఆరోగ్యం మొత్తం క్షీణిస్తుంది. అయితే, మద్యం ప్రియుల్లో ఆరోగ్యంగా.. సన్నగా ఉండే వారికంటే ఊబకాయుల్లో కాలేయం తొందరగా దెబ్బతింటుందని ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేలింది. ఈ మేరకు యూరప్కు చెందిన క్లినికల్ న్యూట్రిషియన్ జర్నల్లో కథనం ప్రచురించారు.
ఛార్లెస్ పర్కిన్స్ సెంటర్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ మెడిసిన్ అండ్ హెల్త్ ప్రొఫెసర్, రీసెర్చ్ ప్రొగ్రామ్ డైరెక్టర్ ఇమ్మాన్యుయెల్ స్టామటాకిస్ ఈ అధ్యయనంపై వివరణ ఇస్తూ ‘‘ఆరోగ్యంగా, సన్నంగా ఉండే వ్యక్తులతో పోలిస్తే.. అధిక బరువు ఉన్నవాళ్లు, ఊబకాయులకు మద్యం సేవించడం వల్ల కాలేయ సంబంధిత వ్యాధులు తొందరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మితంగా మద్యం సేవించినా కాలేయ వ్యాధులు వచ్చే అవకాశం 50శాతం కంటే ఎక్కువగా ఉన్నట్లు తేలింది’’అని పేర్కొన్నారు. మద్యపానం విషయంలో యూకే అమలు చేస్తోన్న మార్గదర్శకాలను మించి మద్యం సేవించే ఊబకాయులపై అధ్యయనం చేయగా.. సాధారణ వ్యక్తుల కంటే కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం 600శాతం అధికంగా, కాలేయ సంబంధిత వ్యాధులతో మరణాలు 700శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434