ఆ జూలో చిలుకలు బూతులు మాట్లాడుతున్నాయట!
జీవరాశుల్లో మనుషులకు మాత్రమే మాట్లాడే అదృష్టం లభించింది. మనుషుల తర్వాత చిలుకలే శిక్షణ ఇస్తే మాట్లాడగలవు. అవి మాట్లాడితే భలే ఉంటుంది. అందుకే ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడితే చిలుక పలుకులు పలుకుతున్నారని అంటుంటారు. అయితే ఆ చిలుకలే
(Photo: Lincolnshire Wildlife Park facebook)
ఇంటర్నెట్ డెస్క్: భూమిపై ఉన్న జీవరాశుల్లో మనుషులకు మాత్రమే మాట్లాడే అదృష్టం లభించింది. మనుషుల తర్వాత చిలుకలే శిక్షణ ఇస్తే మాట్లాడగలవు. అవి మాట్లాడితే భలే ఉంటుంది. అందుకే ఎవరైనా ముద్దుముద్దుగా మాట్లాడితే చిలుక పలుకులు పలుకుతున్నారని అంటుంటారు. అయితే ఆ చిలుకలే యూకేలోని ఓ జూ సిబ్బందిని ఇబ్బందులకు గురిచేశాయి. జూ సందర్శకులను బూతులు తిడుతూ చిలుకలు తెగ అల్లరి చేశాయట. దీంతో జూ నుంచి వాటిని తొలగించాల్సి వచ్చింది.
ఆగస్టు నెలలో యూకేలోని లింకన్షైర్ వైల్డ్లైఫ్ పార్క్ నిర్వాహకులు వివిధ ప్రాంతాల నుంచి పట్టుకొచ్చిన ఐదు చిలుకలను దత్తత తీసుకున్నారు. వాటి ఆరోగ్య భద్రత దృష్ట్యా కొన్ని రోజులు క్వారంటైన్లో ఉంచారు. అయితే ఈ చిలుకలు బూతులు మాట్లాడటం జూ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ ఐదు చిలుకల్లో ఒక చిలుక ఎక్కడ నేర్చుకుందో తెలియదు గానీ, అది మిగతా చిలుకలకు కూడా బూతులు నేర్పించిందట. వాటిని జూలో ఉంచినప్పుడు సందర్శకులను చూసి చిలుకలు బూతులు మాట్లాడుతున్నాయట. చిలుకలు అలా మాట్లాడుతుంటే సందర్శకులు తెగ ఎంజాయ్ చేశారు. కొందరు ఇంకా తిట్టు అన్నట్లు వాటిని ప్రోత్సాహించడం ప్రారంభించారు. పెద్దలకు అది సరదాగానే ఉన్నా.. వారాంతాల్లో చిన్నారులు జూకి వస్తుంటారు. వారి ముందు ఈ చిలుకలు బూతులు మాట్లాడటం బాగోదని భావించిన జూ సిబ్బంది వాటిని జూలో నుంచి తీసుకెళ్లి మరో చోట వేర్వేరు పంజరాల్లో ఉంచారు. ఇలాగైనా అవి కొత్త పదాలు నేర్చుకోకుండా, పాతవి మర్చిపోయే అవకాశముందని భావిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434