Rains: రోడ్లమీదకు వచ్చిన చేపలు.. ఎగబడిన జనాలు

చేపలు పట్టాలంటే సముద్రానికో లేదంటే ఊరి చివర ఉన్న చెరువుకో వెళ్లాలి. కానీ చేపలే మన

Published : 24 Jul 2021 01:07 IST

హైదరాబాద్‌: చేపలు పట్టాలంటే సముద్రానికో లేదంటే ఊరి చివర ఉన్న చెరువుకో వెళ్లాలి. కానీ, చేపలే మన దగ్గరికొస్తే ఆ అనుభూతి చెప్పలేం. హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాల పుణ్యమా అని చేపలు పొలాలు, ఇళ్లు, ఆఖరికి రోడ్లపైకి వచ్చేస్తున్నాయి. కళ్లముందే చేపలు కనిపించడంతో జనాలు వేటకు వేళాయేరా అంటూ వాటిని పట్టుకునేందుకు పరుగులు పెడుతున్నారు. జగిత్యాల జిల్లా, మెట్‌పల్లి మండలం, మేడిపల్లి, బండిలింగాపూర్‌ గ్రామాలకు చెందిన చెరువు గట్లు తెగిపోవడంతో చేపలు పొలాలు, ఇళ్లు, రోడ్ల మీదకు వస్తున్నాయి. ఆ చేపలు పట్టేందుకు జనాలు పోటీ పడుతున్నారు. రోడ్ల మీదకు వచ్చిన చేపలు పట్టేందుకు జనాలు గుమిగూడటంతో రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని