TSPSC: పేపర్ లీకేజీ కేసు.. రెండో రోజు కొనసాగనున్న సిట్ విచారణ
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ రెండో రోజు విచారణ చేపట్టనుంది. నిందితులు ప్రవీణ్, రాజశేఖర్, డాక్యనాయక్, రాజేశ్వర్ను సుదీర్ఘంగా విచారించి అధికారులు కీలక విషయాలను రాబట్టనున్నారు.
హైదరాబాద్: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను సిట్ అధికారులు రెండో రోజు విచారించనున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, డాక్యానాయక్, రాజేశ్వర్ను సుదీర్ఘంగా విచారించి వారి నుంచి కీలకమైన విషయాలను రాబట్టనున్నారు. సీసీఎస్ నుంచి సిట్ కార్యాలయానికి నిందితులను తరలించి విచారించనున్నారు.
ఆదివారం సిట్ విచారణలో డాక్యా నాయక్, రాజేశ్వర్ను హైదరాబాద్లో బస చేసిన హోటల్కి తీసుకువెళ్లి అధికారులు వివరాలు సేకరించారు. అలాగే గ్రూప్-1 ప్రిలిమ్స్లో 100కు పైగా మార్కులు సాధించిన పలువురు అభ్యర్థులనూ సిట్ పోలీసులు నిన్న విచారించారు. వివిధ జిల్లాలకు చెందిన 20 మంది యువతీ, యువకులను హిమాయత్నగర్లోని సిట్ కార్యాలయంలో రెండో రోజు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరికొంతమందిని అదుపులో తీసుకొని సిట్ అధికారులు ప్రశ్నించనున్నట్లు సమాచారం.
నాంపల్లి కోర్టులో విచారణ..
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నలుగురు నిందితులను నాంపల్లి కోర్టు పోలీసు కస్టడీకి అనుమతించిన విషయం తెలిసిందే. ఏ1 నిందితుడు ప్రవీణ్తోపాటు ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్యా నాయక్, ఏ5 కేతావత్ రాజేశ్వర్లను కస్టడీకి అప్పగించింది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు వీరిని విచారిస్తున్నారు. మిగతా ముగ్గురు నిందితులు ఏ-10 షమీమ్, ఏ-11 సురేశ్, ఏ-12 రమేశ్ల కస్టడీ పిటిషన్పై విచారణను న్యాయస్థానం సోమవారానికి వాయిదా వేయగా.. నేడు నాంపల్లి కోర్టు విచారణ చేపట్టనుంది. ఈ ముగ్గురు నిందితులను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ పిటిషన్లో న్యాయస్థానాన్ని కోరింది. కస్టడీ పిటిషన్పై నాంపల్లి కోర్టు విచారించి నేడు తీర్పు వెలువరించనుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!