ప్రిలిమ్స్‌ రాసేవాళ్లకు ప్రత్యేక రైళ్లు

సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనుంది.

Published : 26 Sep 2020 19:34 IST

విశాఖ: సివిల్స్‌ ప్రిలిమ్స్‌ పరీక్ష రాసే విద్యార్థుల కోసం తూర్పు కోస్తా రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయనుంది. పరీక్షల సందర్భంగా అక్టోబర్‌ 3, 4 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇచ్ఛాపురం - విశాఖ; కోరాపుట్‌ - విశాఖ; కోరాపుట్‌ - కటక్‌ మధ్య  ఈ రైలు సర్వీసులను అందించనున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ పరీక్ష మే 31న జరగాల్సి ఉన్నప్పటికీ కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో కేంద్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వాయిదా వేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని