వివేకా హత్య కేసు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన సునీత

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Updated : 08 Apr 2024 11:28 IST

దిల్లీ: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు (Viveka Murder Case)లో ఆయన కుమార్తె సునీత (Suneetha Narreddy) మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ను రద్దు చేయాలని పిటిషన్‌ దాఖలు చేశారు. శివశంకర్‌కు తెలంగాణ హైకోర్టు ఇటీవల బెయిల్ మంజూరు చేసింది. ఆ ఆదేశాలను సవాల్‌ చేస్తూ సునీత అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ వేశారు. దీనిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా ధర్మాసనం నేడు విచారణ చేపట్టనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని