సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే: సుప్రీం
కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్...
దిల్లీ: కరోనా సంక్షోభంలో రుణగ్రహీతలకు ఇచ్చిన మారటోరియం కాలంలో విధించిన చక్రవడ్డీ మాఫీ విషయంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ అమలు ఏమైందని జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది. చక్రవడ్డీ మాఫీపై నిర్ణయం తీసుకున్నామని.. అయితే ఇంకా అమలు చేయలేదని సోలిసిటరీ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. మరోవైపు రూ.2 కోట్ల వరకు ఉన్న రుణాలపై చక్రవడ్డీ మాఫీ చేస్తామని బ్యాంకుల తరఫు న్యాయవాది హరీష్ సాల్వే కూడా కోర్టుకు తెలిపారు.
చక్రవడ్డీ మాఫీ చేస్తామని నిర్ణయం తీసుకున్న తర్వాత అమలు చేయడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని ఈ సందర్భంగా కేంద్రాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. రుణాలు ఇవ్వడంలో వైవిధ్యమైన పద్ధతులుంటాయని, అందుకే బ్యాంకులతో సంప్రదింపులు జరిపినట్లు మెహతా కోర్టుకు సమాధానమిచ్చారు. కేంద్రం ఇచ్చిన సమాధానంపై అసంతృప్తి వ్యక్తం చేసిన ధర్మాసనం.. చక్రవడ్డీ మాఫీ విషయంలో కేంద్ర నిర్ణయంపై సామాన్య ప్రజల్లో ఇంకా ఆందోళన ఉందని చెప్పింది. సామాన్యులకు ఊరటనిచ్చే నిర్ణయాన్ని తాము స్వాగతిస్తున్నామని.. అయితే ఈ నిర్ణయాన్ని కేంద్రం త్వరగా అమలు చేయాలని కోరుకుంటున్నట్లు జస్టిస్ ఎం.ఆర్ షా తెలిపారు. ‘సామాన్యుల దీపావళి మీ చేతుల్లోనే ఉంది’ అని కేంద్రాన్ని ఉద్దేశిస్తూ వ్యాఖ్యానించారు. తదుపరి విచారణ సమయానికి చక్రవడ్డీ మాఫీ అమల్లోకి వస్తుందని సుప్రీం ధర్మాసనం ఆశాభావం వ్యక్తం చేస్తూ.. తదుపరి విచారణను నవంబర్ 2కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!