మన్నేపల్లి అప్పారావుకు ‘స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్’ అవార్డు
స్వామి వివేకానంద జయంతి నేపథ్యంలో స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ సామాజిక కార్యకర్త మన్నేపల్లి అప్పారావు అందుకున్నారు.
హైదరాబాద్: స్వామి వివేకానంద జయంతి సందర్భంగా విశ్వగురు రికార్డ్స్ కమిటీ ఇచ్చే ‘స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్’ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. కూకట్పల్లిలోని భారత్ వికాస్ పరిషత్లో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి సీబీఐ పూర్వ జేడీ లక్ష్మీనారాయణ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 2023 ఏడాదికి గాను స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ అవార్డును ప్రముఖ సామాజిక కార్యకర్త మన్నేపల్లి అప్పారావుకు ప్రదానం చేశారు.
‘థాంక్స్ గివింగ్’ అనే నరేంద్రుని మహోక్తిని అక్షరాలా పాటిస్తూ సాటి మనుషులకు సాయం అందిస్తోన్న మన్నేపల్లి అప్పారావు.. కర్ణాటకలోని కలికేరి విశ్వవిద్యాలయం, నరసరావుపేట వద్ద నైస్ విశ్వవిద్యాలయం, విశాఖ జిల్లాలోని చలిసింగం గ్రామంలో విద్యాలయం.. ఇలా పాఠశాలల నిర్మాణంలో తన వంతు సహకారం అందించారు. నిరు పేదల కష్టాలకు చలించే గొప్ప మనసున్న ఆయన.. అటవీ ప్రాంతాల్లోని పలుచోట్ల ప్రాథమిక పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించారు. అంతేకాకుండా హైదరాబాద్లోని తన ఇంట్లో పేద విద్యార్థులకు ఆశ్రయం కల్పించి వారిని ఇంజినీర్లు, సైంటిస్టులు, ఫార్మసీ, సాఫ్ట్వేర్ రంగాల్లో ఉన్నతులుగా ఎదిగేందుకు సహకరించి తన గొప్ప మనసును చాటుకున్నారు. గిరిపుత్రులకు వీఆర్ పురం మండలంలోని పోలవరం నిర్వాసితులకు మూడు పంటలు పండే దాదాపు 400 ఎకరాల భూముల్ని ఇప్పించి వారికి ఆరాథ్యుడయ్యారు. స్వామి వివేకానంద ఇండియన్ ఐకాన్ పురస్కారం అందుకోవడం తనకు ఓ తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుందని ఆయన పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!