Andhra News: ముగిసిన బొజ్జల అంత్యక్రియలు.. పాల్గొన్న చంద్రబాబు

తెదేపా నేత, సీనియర్‌ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా ఊరందూరులోని వ్యవసాయ క్షేత్రంలో

Updated : 08 May 2022 15:05 IST

తిరుపతి: తెదేపా నేత, సీనియర్‌ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తిరుపతి జిల్లా ఊరందూరులోని వ్యవసాయ క్షేత్రంలో అశేషంగా తరలివచ్చిన అభిమానుల మధ్య బొజ్జల అంత్యక్రియలు నిర్వహించారు. ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు తుది వీడ్కోలు పలికారు. బొజ్జల అంత్యక్రియల్లో తెదేపా అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొజ్జల సతీమణిని ఆయన పరామర్శించారు.

చంద్రబాబు మాట్లాడుతూ.. ఆప్తమిత్రుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. శ్రీకాళహస్తి ప్రజలు బొజ్జలను ఎన్నటీకి మరవరని చెప్పారు. రాష్ట్రాభివృద్ధిలో మంత్రిగా ఆయన కీలకపాత్ర పోషించారని కొనియాడారు. బొజ్జల స్ఫూర్తిని ఆయన కుమారుడు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని