TS: కొత్తగా 4,305 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 నమూనాలను పరీక్షించగా.. 4,305 మందికి పాజిటివ్‌గా తేలింది.

Updated : 14 May 2021 19:56 IST

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 57,416 నమూనాలను పరీక్షించగా.. 4,305 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో ఇప్పటివరకు కరోనా సోకిన వారిసంఖ్య 5,20,709కి చేరింది. తాజాగా కరోనాతో 29 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం మృతుల సంఖ్య 2896కి పెరిగింది. ఇవాళ 6,361 మంది కరోనా నుంచి కోలుకున్నట్లు రాష్ట్రప్రభుత్వం బులిటెన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 54,832 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు పేర్కొంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో కేసుల తీవ్రత క్రమంగా తగ్గుతోంది. తాజాగా 607 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్రప్రభుత్వం తెలిపింది. నల్గొండలో 246, కరీంనగర్‌లో 229, ఖమ్మంలో 222 మందికి పాజిటివ్‌గా తేలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని