Ap News: న్యాయస్థానం TO దేవస్థానం.. అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో మహాపాదయాత్ర

నవంబర్‌ 1 నుంచి న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరిట మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని అమరావతి ఐకాస, రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. తుళ్లూరులో...

Updated : 12 Oct 2021 20:32 IST

అమరావతి: నవంబర్‌ 1 నుంచి ‘న్యాయస్థానం నుంచి దేవస్థానం’ పేరిట మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు అమరావతి ఐకాస ప్రకటించింది. అమరావతి నుంచి తిరుమల వరకు పాదయాత్ర కొనసాగుతుందని అమరావతి ఐకాస, రైతు సంఘాల నేతలు స్పష్టం చేశారు. తుళ్లూరులో జరిగిన అమరావతి ఐకాస విస్తృత స్థాయి సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నవంబర్ 1 నుంచి డిసెంబర్ 17 వరకు 45 రోజుల పాటు పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. ఈ యాత్రలో భాగంగా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలను గ్రామగ్రామాన ప్రజలకు వివరిస్తామన్నారు. పాదయాత్రలో అన్ని వర్గాలను కలుపుకొని పోతామన్నారు. న్యాయపరమైన అంశాలను పరిశీలించి అమరావతి వల్ల 13 జిల్లాలకు కలిగే ఉపయోగాలపై ప్రజలకు వివరించనున్నట్లు ఐకాస నేతలు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని