TS News: హుజూరాబాద్‌లో దళితబంధుకు మరో రూ.500 కోట్లు విడుదల

హుజూరాబాద్‌ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది.

Updated : 23 Aug 2021 10:23 IST

హైదరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.500 కోట్ల నిధులు విడుదల చేసింది. దళితబంధు పైలెట్‌ ప్రాజక్టు కింద రూ.2 వేల కోట్లు విడుదల చేయాలని హుజురాబాద్‌ సభ అనంతరం సీఎం కేసీఆర్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మొదటి విడతలో భాగంగా ఇప్పటికే రూ.500 కోట్లు విడుదలయ్యాయి. వారం లోపు మరో రూ.1000 కోట్లు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని