Bank Loans: ఏపీకి 10 బ్యాంకులు ఇచ్చిన రుణాల వివరాలివే.. 

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు 10 ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) నుంచి తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం 

Published : 10 Aug 2021 13:59 IST

వెల్లడించిన కేంద్రం

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు 10 ప్రభుత్వరంగ బ్యాంకుల(పీఎస్‌బీ) నుంచి తీసుకున్న రుణాలను కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 2019 ఏప్రిల్‌ 1 నుంచి బ్యాంకులు ఇచ్చిన రుణాలపై వివరణ ఇచ్చింది. ‘‘10 పీఎస్‌బీలు రూ.56,076 కోట్ల రుణాలిచ్చాయి. అత్యధికంగా ఎస్‌బీఐ రూ.15,047 కోట్ల రుణాలు ఇచ్చింది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా రూ.9,450 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.7,075 కోట్లు, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ రూ.5,797 కోట్లు, ఇండియన్‌ బ్యాంక్‌ రూ. 4,300 కోట్లు, బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర రూ.2,800 కోట్లు, కెనరా బ్యాంక్‌ రూ.2,307 కోట్లు, పంజాబ్‌ అండ్‌ సింథ్‌ బ్యాంక్‌ రూ.750 కోట్ల రుణాలు ఇచ్చాయి’’ అని తెలిపింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు కేంద్రం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని