CM Jagn: రేపు దిల్లీకి సీఎం జగన్‌.. ప్రధానితో భేటీ

ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని

Updated : 02 Jan 2022 15:31 IST

అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి రేపు దిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. మూడు రాజధానుల అంశం, అమరావతి అభివృద్ధి కార్యాచరణ, పోలవరం ప్రాజెక్టుకు నిధులు రాబట్టే అంశాలపై ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. విభజన హామీలు నేరవేర్చాలని జగన్‌ ప్రధానిని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు రాష్ట్ర సమస్యలపై మోదీకి ఆయన వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రధానితో పాటు జగన్.. అమిత్‌ షా సహా పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని