AP News: వరద ప్రభావిత జిల్లాల్లో రేపు, ఎల్లుండి సీఎం జగన్‌ పర్యటన

వరద ప్రభావిత జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి నేరుగా బాధిత

Published : 01 Dec 2021 21:38 IST

అమరావతి: వరద ప్రభావిత జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. వరద ప్రభావిత కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పర్యటించి నేరుగా బాధిత ప్రజలు, రైతులతో మాట్లాడనున్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న అన్నమయ్య ప్రాజెక్టును స్వయంగా పరిశీలించనున్న సీఎం.. ప్రాజెక్టు పరిసర గ్రామాల ప్రజలతో వరద నష్టం, సహాయక చర్యలపై నేరుగా మాట్లాడనున్నారు. భారీ వర్షాలతో తీవ్రంగా ప్రభావితమైన తిరుపతిలోనూ సీఎం పర్యటిస్తారు. ఎల్లుండి చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో సీఎం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పెన్నానదీ పరివాహక ప్రాంతాల్లో దెబ్బతిన్న రోడ్లు, పంట పొలాలను స్వయంగా పరిశీలించనున్నారు. అధికారులతో వరద నష్టం, సహాయక చర్యలపై సమీక్షలు చేయనున్నారు. గురువారం ఉదయం 9.30 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి కడప జిల్లాకు బయల్దేరుతారు.10.50 గంటలకు కడప జిల్లా మందపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి పుల్లపొత్తూరు గ్రామానికి వెళ్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని