కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ ఆందోళన

కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.

Updated : 19 Jul 2021 16:13 IST

హైదరాబాద్‌: కోకాపేట భూముల వద్ద కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కోకాపేట భూముల సందర్శనకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో అక్కడికి చేరుకున్న కాంగ్రెస్‌ నేతలు ఆ పార్టీ జెండాను పాతారు. ఈ క్రమంలో పోలీసులు, కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌, పీసీసీ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కోదండరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలను పోలీసులు గృహనిర్బంధం చేసిన విషయం తెలిసిందే. 

మరిన్ని ఫొటోల కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని