Ap Corona: ఆంధ్రప్రదేశ్‌లో భారీగా నమోదైన కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు వేగంగా, భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 పరీక్షలు

Updated : 12 Jan 2022 17:15 IST

అమరావతి‌: ఆంధ్రప్రదేశ్‌లో రోజురోజుకూ కరోనా కేసులు వేగంగా, భారీగా పెరుగుతున్నాయి. రెండు రోజుల్లోనే 2వేలకుపైగా కొత్త కేసులు పెరిగాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 41,954 పరీక్షలు నిర్వహించగా.. 3,205 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసులు 20,87,879కి చేరాయి. ఒక్కరోజు వ్యవధిలో కొవిడ్‌ వల్ల ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు. దీంతో రాష్ట్రంలో కొవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. ఒక్కరోజు వ్యవధిలో 281 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో ఇప్పటివరకు 20,63,255 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 10,119 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని