Ap News: తిరుమలలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం.. అదుపులో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావుపై...

Updated : 04 Jan 2022 13:24 IST

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో నకిలీ దర్శన టికెట్ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. నకిలీ టికెట్ల వ్యవహారంలో ఎస్‌పీఎఫ్‌ కానిస్టేబుల్‌ కృష్ణారావుపై కేసు నమోదు చేశారు. నకిలీ టికెట్లను కానిస్టేబుల్‌ కృష్ణారావు తయారు చేసినట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ముగ్గురు భక్తులను ఈ టికెట్లను విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది. మూడు రూ.300 టికెట్లను రూ.21 వేలకు విక్రయించినట్లు భక్తులు తెలిపారు. నకిలీ టికెట్లతో వచ్చిన భక్తులను విజిలెన్స్‌ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ టికెట్ల వ్యవహారం ఎప్పటినుంచి జరుగుతుందనే దానిపై విజిలెన్స్‌ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. లడ్డూ కౌంటర్‌, టికెట్‌ స్కానింగ్‌ వద్ద పని చేస్తున్న మరో ఇద్దరు ఉద్యోగులు కృష్ణారావుకు సహకరించినట్లు అధికారులు గుర్తించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని