TS News: మెట్‌పల్లిలో మహాధర్నా.. భారీగా తరలివచ్చిన అన్నదాతలు

జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాంటూ మెట్‌పల్లిలో

Updated : 12 Oct 2021 13:49 IST

మెట్‌పల్లి: జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్‌ ఫ్యాక్టరీని వెంటనే తెరిపించాలంటూ మెట్‌పల్లిలో రైతులు ఆందోళనకు దిగారు. జగిత్యాల, నిజామాబాద్‌, నిర్మల్ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున  రైతులు మెట్‌పల్లి తరలివచ్చి నిరసన తెలిపారు. మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌ నుంచి ర్యాలీగా వెళ్లి శాస్త్రి చౌరస్తా వద్ద జాతీయ రహదారిపై మహా ధర్నా చేపట్టారు. చెరకు రైతులను ఆదుకోవాలని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుతో పాటు ధాన్యం కొనుగోలు చేసి రూ.15వేల మద్దతు ధర ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని