AP News: అధిక ధర పలికిన పులస చేప

తూర్పుగోదావరి జిల్లాలో పులస చేప అధిక ధర పలికింది. అంతర్వేది వశిష్ఠ గోదావరిలో సుమారు రెండు

Updated : 25 Sep 2021 14:22 IST

అంతర్వేది: తూర్పుగోదావరి జిల్లాలో పులస చేప అధిక ధర పలికింది. అంతర్వేది వశిష్ఠ గోదావరిలో సుమారు రెండు కేజీల బరువున్న పులస చేప స్థానిక మత్స్యకారులకు చిక్కింది. దీన్ని స్థానిక మార్కెట్‌లో వేలానికి పెట్టగా వ్యాపారులతో పాటు పులస ప్రియులు పోటీ పడి పాల్గొన్నారు. చివరికి నరసాపురానికి చెందిన ఓ వ్యాపారి రూ.18వేలకు ఆ పులసను దక్కించుకున్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని