AP News: జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీని బహిష్కరించిన ఉద్యోగ సంఘాలు
పీఆర్సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి.
అమరావతి: పీఆర్సీ అమలు సహా ఉద్యోగుల ఇతర డిమాండ్ల అమలుపై మరోసారి జరుగుతున్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీ నుంచి పలు ఉద్యోగ సంఘాలు బయటికొచ్చాయి. ఏపీ జేఏసీ, అమరావతి జేఏసీ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ తీరుకు నిరసన వ్యక్తం చేస్తూ సమావేశం నుంచి బయటికి వచ్చేశారు. ఈ సమావేశంలో సీఎస్ కాకుండా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి, ఇతర అధికారులు మాత్రమే హాజరయ్యారు. దీంతో ప్రభుత్వ వైఖరిపై ఆయా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. సమావేశంలో పీఆర్సీ నివేదికను బహిర్గతం చేస్తామని చెప్పినప్పటికీ దానికి సంబంధించి అధికారుల నుంచి ఏ విధమైన స్పందన లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు బయటకు వచ్చారు. మొత్తం 13 ఉద్యోగ సంఘాలు సమావేశానికి హాజరు కాగా.. 9 ఉద్యోగ సంఘాలు సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు ప్రకటించాయి.
పీఆర్సీ నివేదిక ఇవ్వకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తోందని ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ ఆరోపించారు. ఇవాళ కూడా ఉద్యోగులను అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు మాత్రం సమావేశంలో పీఆర్సీ నివేదిక ఊసే ఎత్తడం లేదని రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరోపించారు. పీఆర్సీ నివేదికపై అధికారుల కమిటీ మళ్లీ అధ్యయనం చేయడం ఏమిటని ప్రశ్నించారు. సమావేశంలో తాము అడిగిన అంశాలకు స్పష్టంగా సమాధానం చెప్పలేదన్నారు. అక్టోబరు 29 నాటి భేటీలో ఇస్తామన్న నివేదిక ఇంత వరకు ఇవ్వలేదని, కనీసం ఇవాళ్టి సమావేశంలో అయినా ఇస్తారని ఆశించామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోకుంటే కార్యాచరణ ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా ‘మిగ్జాం (Michaung Cyclone)’ బలపడింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సీఎం జగన్ (CM Jagan) వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. -
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత
మిగ్జాం తుపాను (Cyclone Michaung)కారణంగా తిరుమలలోని పర్యాటక ప్రదేశాల సందర్శనను తితిదే అధికారులు తాత్కాలికంగా రద్దు చేశారు. -
Andhra Pradesh: తీవ్ర తుపానుగా మిగ్జాం.. ఈ జిల్లాల్లో తీవ్ర ప్రభావం
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మిగ్జాం తుపాను (Michaung Cyclone) తీవ్ర తుపానుగా బలపడింది. ప్రస్తుతం కోస్తాంధ్ర తీరానికి ఆనుకొని ఇది కదులుతోంది. -
Cyclone Michaung: ‘మిగ్జాం’ ప్రభావం.. తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావంతో తెలంగాణలో వచ్చే రెండు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు, అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ వెల్లడించింది. -
Telangana: టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకర్రావు రాజీనామా
టీఎస్ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ బాధ్యతల నుంచి ప్రభాకరరావు వైదొలిగారు. -
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: మిగ్జాం ఎఫెక్ట్.. కోస్తాంధ్రకు రెడ్ అలర్ట్
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను కారణంగా కోస్తాంధ్రకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. -
Swarnamukhi River: తుపాను ఎఫెక్ట్.. ‘స్వర్ణముఖి’లోకి భారీగా వరద
మిగ్జాం (Cyclone Michaung) తుపాను ప్రభావంతో తిరుపతి జిల్లాలో పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దు
మిగ్జాం తుపాను (Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. -
kazipet-vijayawada : కాజీపేట-విజయవాడ మార్గంలో పలు రైళ్ల రద్దు
కాజీపేట-వరంగల్ రైల్వేస్టేషన్ల మధ్య జరుగుతున్న మూడోలైను పనుల కారణంగా కాజీపేట-విజయవాడ మార్గంలో నడిచే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
Cyclone Michaung: తుపాను ఎఫెక్ట్.. ఏపీ వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు
నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడిన మిగ్జాం తుపాను(Cyclone Michaung) ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. -
Cyclone Michaung: తుపాను.. గంటకు 14కి.మీ వేగంతో ముందుకు..
మిగ్జాం తుపాను గంటకు 14కి.మీ వేగంతో ముందుకు కదులుతున్నట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. -
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
Cyclone Michaung: తుపాను ప్రభావం తగ్గేవరకు అప్రమత్తంగా ఉండాలి: నెల్లూరు కలెక్టర్ ఆదేశాలు
మిగ్జాం తుపాను నేపథ్యంలో అధికారులకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ఆదేశాలు జారీ చేశారు. -
నోటా.. మాట వినలేదు..!
పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకుంటే నోటా (నన్ ఆఫ్ ద అబోవ్)కు ఓటు వేయొచ్చు. ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో నోటా మాట చాలా మంది వినలేదు. -
కష్టకాలంలో నిలబడి.. ఎమ్మెల్యేగా గెలిచి
కాంగ్రెస్ అభ్యర్థిగా అనూహ్య విజయం సాధించిన మాలోత్ రాందాస్నాయక్ రాజకీయ జీవితం పరిశీలిస్తే ఆది నుంచి ఆటుపోట్లే. -
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/12/2023)
Rasi Phalalu in Telugu: ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.


తాజా వార్తలు (Latest News)
-
Mamata Banerjee: కూటమితో కలిసి రాకపోవడం వల్లే కాంగ్రెస్ ఓటమి: మమత
-
CM Jagan: ‘మిగ్జాం’ ఎఫెక్ట్.. ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు: సీఎం జగన్
-
Trisha: నెటిజన్ల విమర్శలు.. ‘యానిమల్’పై పోస్ట్ తొలగించిన త్రిష
-
Bigg boss telugu 7: ఆటలు ఆడకపోయినా అందుకే శివాజీ హౌస్లో ఉంటున్నారు: గౌతమ్కృష్ణ
-
Hamas: 200 హమాస్ స్థావరాలపై విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సైన్యం
-
Tirumala: శ్రీవారి మెట్టు మార్గంలో భక్తుల రాకపోకలు నిలిపివేత