AP News: సీఎం జగన్‌ను కలిసిన స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌

భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో

Updated : 29 Dec 2021 15:06 IST

అమరావతి: భారత స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌ ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో శ్రీకాంత్‌ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ను సీఎం ఘనంగా సన్మానించారు. అనంతరం ఈ స్టార్‌ షట్లర్‌కు ప్రభుత్వం తరఫున రూ.7లక్షల నగదు బహుమతి అందజేశారు. దీంతో పాటు తిరుపతిలో అకాడమీ ఏర్పాటుకు ఐదెకరాల భూమి కేటాయించారు. కాగా, శ్రీకాంత్‌ ఏపీ ప్రభుత్వంలో డిప్యూటీ కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని