Ts corona Update: తెలంగాణలో కొత్తగా మరో 4ఒమిక్రాన్ కేసులు
తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 3 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో
హైదరాబాద్: తెలంగాణలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత 24 గంటల వ్యవధిలో తెలంగాణలో మరో 4 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 24కి చేరింది. 24 గంటల వ్యవధిలో ఎట్ రిస్క్ దేశాల నుంచి 726 మంది శంషాబాద్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి (ఆర్జీఐఏ) చేరుకున్నారు. వారందరికీ కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ టెస్టులు చేయగా నలుగురికి పాజిటివ్గా తేలింది. దీంతో అధికారులు వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు.
ఇప్పటివరకు ఎట్రిస్క్ దేశాల నుంచి వచ్చిన 9,122 మంది ప్రయాణికులకు ఆర్జీఐఏలో కొవిడ్ ఆర్టీ-పీసీఆర్ పరీక్షలు చేశారు. వారిలో 59 మందికి కొవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. వారందరి శాంపిల్స్ని అధికారులు జీనోమ్ సీక్వెన్సింగ్కి పంపించారు. వారిలో 22 మందికి ఇప్పటికే ఒమిక్రాన్ నెగెటివ్ వచ్చింది. మిగిలిన వారిలో 24 మందికి ఒమిక్రాన్ పాజిటివ్గా తేలగా.. మరో 13 మంది ఫలితాలు రావాల్సి ఉంది.
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 39,919 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 172 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 6,79,892కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు మృతుల సంఖ్య 4,016కు చేరింది. కరోనా బారి నుంచి నిన్న 188 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,625 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.