Ts High Court: 111 జీవో రద్దు చేసే ఆలోచన ఉంటే ఎందుకు చెప్పడం లేదు: హైకోర్టు
ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే విషయాన్ని రేపు తెలపాలని రాష్ట్ర
హైదరాబాద్: ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరీవాహక ప్రాంతాల్లో నిర్మాణాలను నియంత్రించే జీవో 111ని రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అనే విషయాన్ని రేపు తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. జీవో 111తో పాటు కోకాపేట భూముల వేలంపై దాఖలైన పలు పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది.
జీవో 111ని రద్దు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని విచారణ సందర్భంగా ధర్మాసనం ప్రస్తావించింది. జీవో రద్దు చేసే ఆలోచన ఏమైనా ఉందా? అని అదనపు అడ్వొకేట్ జనరల్ రామచంద్రరావును ధర్మాసనం ప్రశ్నించింది. జీవో రద్దు చేసే ఆలోచన ఉంటే.. దానిపై ఇన్ని రోజులుగా విచారణ జరపాల్సిన అవసరం ఏముందని న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. జీవో 111ను రద్దు చేసే ఆలోచన ఉంటే ఆ విషయాన్ని ఎందుకు చెప్పడం లేదని అదనపు ఏజీని హైకోర్టు నిలదీసింది. అసమగ్రంగా వివరాలు సమర్పించి కోర్టును ఎందుకు తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్రికా కథనంపై తనకు స్పష్టత లేదని.. ప్రభుత్వాన్ని సంప్రదించి రేపు పూర్తి వివరాలు చెబుతానని అదనపు ఏజీ తెలిపారు. విచారణ రేపటికి వాయిదా వేసిన హైకోర్టు.. ఉన్నతాధికారులను కూడా పిలిపించుకోవాలని సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు