Ts News: దసరా ఎఫెక్ట్‌.. విజయవాడ హైవేపై స్తంభించిన ట్రాఫిక్

విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా, చౌటుప్పల్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ..

Updated : 17 Oct 2021 20:54 IST

చౌటుప్పల్‌ గ్రామీణం : విజయవాడ - హైదరాబాద్‌ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా, చౌటుప్పల్‌ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లిన  ప్రయాణికులు తిరిగి హైదరాబాద్‌ చేరుకుంటుండంతో జాతీయరహదారి కిక్కిరిసిపోయింది. పండక్కి ఊరెళ్లిన  తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు ఉదయం నుంచే హైదరాబాద్‌ పయనమవడంతో విజయవాడ-హైదరాబాద్‌ మార్గంలో రద్దీ అధికమైంది. సాయంత్రానికి వాహనాల రద్దీ మరింత పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. చౌటుప్పల్‌లో అండర్‌పాస్‌ వంతెన లేకపోవడంతో పండుగ వేళ, శుభకార్యాలు ఎక్కువగా ఉన్న  రోజుల్లో ట్రాఫిక్‌ సమస్య ఉత్పన్నమవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని