Ap High Court: వారిద్దరికీ 29న శిక్ష ఖరారు చేస్తాం: ఏపీ హైకోర్టు

కోర్టు ధిక్కరణ కేసులు ఇద్దరు ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు తెలిపింది. సెరీకల్చర్‌ విభాగంగా

Updated : 15 Sep 2021 19:41 IST

అమరావతి: కోర్టు ధిక్కరణ కేసులు ఇద్దరు ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, చిరంజీవి చౌదరిలకు ఈ నెల 29న శిక్ష ఖరారు చేస్తామని హైకోర్టు తెలిపింది. సెరీకల్చర్‌ విభాగంగా విధులు నిర్వహిస్తున్న కొందరు తాత్కాలిక ఉద్యోగులు తమ సర్వీసును క్రమబద్ధీకరించాలని వేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం వారి సర్వీసు క్రమబద్ధీకరణకు ఆదేశించింది. ఈ ఆదేశాలను అమలు చేయనుందున తాత్కాలిక ఉద్యోగులు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. తమ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే అమలు చేయడం లేదని ఇద్దరు అధికారులనుద్దేశించి వ్యాఖ్యానించింది. ఇవాళ్టి విచారణకు హాజరు కాకపోవడంతో ఇద్దరు అధికారులపై నాన్‌బెయిలబుల్‌ వారెంట్లు జారీ చేసింది. ఈ నెల 29న వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా వేసిన ఉన్నత న్యాయస్థానం అదే రోజు ఇద్దరు ఉన్నతాధికారులకు శిక్షలు ఖరారు చేయనున్నట్లు తెలిపింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని