TS News: మందకృష్ణ మాదిగను పరామర్శించిన కేంద్రమంత్రులు

ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రులు పరామర్శించారు.

Updated : 24 Oct 2021 11:49 IST

హైదరాబాద్‌: ఎంఆర్‌పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కేంద్ర మంత్రులు పరామర్శించారు. ఇటీవల స్నానాల గదిలో జారిపడి కోలుకుంటున్న ఆయనను నగరంలోని డీడీ కాలనీలో ఉన్న నివాసంలో కేంద్రమంత్రులు మురుగన్‌, కిషన్‌రెడ్డి, నారాయణస్వామి, ఎమ్మెల్యే రఘునందన్‌ కలిశారు. ఈ సందర్భంగా వారు మందకృష్ణమాదిగతో కలిసి అల్పాహారం చేశారు. ఈ మధ్యాహ్నం 2గంటలకు బోయిన్‌పల్లిలో నిర్వహించే ఎస్సీ ఉద్యోగుల 5వ జాతీయ మహా సభలో కేంద్ర మంత్రులు పాల్గొననున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని