Telangana News: తెలంగాణలో 12నుంచి పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు జారీ

తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 12వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ...

Published : 12 May 2022 01:50 IST

హైదరాబాద్‌: తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల హాల్ టికెట్లను ఈ నెల 12వ తేదీ నుంచి జారీ చేయనున్నారు. ఈ మేరకు హాల్ టికెట్లను ఆయా పాఠశాలలకు పంపించినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకుడు కృష్ణారావు తెలిపారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుల నుంచి విద్యార్థులు తమ హాల్ టికెట్లు పొందవచ్చని చెప్పారు. గురువారం నుంచి విద్యాశాఖ వెబ్‌సైట్‌లో కూడా హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయన్నారు. www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చని కృష్ణారావు తెలిపారు. ఈనెల 23 నుంచి జూన్ 1 వరకు రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని