Guinness World Record: రెండేళ్లలో మూడు గిన్నిస్ రికార్డులు
చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన మల్లికార్జున మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 1 నుంచి 50 వరకు అంకెలను వేగంగా టైప్ చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు.
అంకెలు టైప్ చేస్తున్న మల్లికార్జున
సదుం, న్యూస్టుడే: చిత్తూరు జిల్లా సదుం మండలం నడిగడ్డ గ్రామానికి చెందిన మల్లికార్జున మరోసారి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. 1 నుంచి 50 వరకు అంకెలను వేగంగా టైప్ చేసిన వ్యక్తిగా గుర్తింపు సాధించారు. హైదరాబాద్కు చెందిన వ్యక్తి 2015లో 14.88 సెకన్లలో 1- 50 సంఖ్యలు టైప్ చేసి గిన్నిస్ రికార్డు పొందారు. దాన్ని మల్లికార్జున తిరగరాశారు. ఈయన ఈ ఏడాది జూన్ 11న పుంగనూరులో నిపుణుల సమక్షంలో 13.16 సెకన్లలో 50 సంఖ్యలు టైప్ చేశారు. ఆ వీడియోను రికార్డు చేసి లండన్లోని గిన్నిస్ రికార్డ్సు సంస్థకు పంపారు. వారు దానిని సమీక్షించి కొత్త రికార్డుగా గుర్తించి మల్లికార్జునకు తాజాగా ప్రశంసాపత్రాన్ని పంపించారు. అంతే కాకుండా మల్లికార్జున టైపింగ్ చేస్తున్న వీడియోను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో సంస్థ పోస్టు చేసింది. 2022లో యోగాలో అష్టవక్రాసనం, 2023లో ఎక్కువ దేశాల కాలింగ్ కోడ్లు గుర్తించడంలో మల్లికార్జున రికార్డులు సాధించారు. దీంతో ఆయన రెండేళ్ల వ్యవధిలో మూడు వరల్డ్ రికార్డులు సాధించిన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
గిన్నిస్ రికార్డు సాధించినట్లు అందిన పత్రం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
ఆస్తి పంపకాల కోసం తల్లి అంత్యక్రియలకు కన్నబిడ్డలే అడ్డుపడ్డారు. ఫలితంగా రెండు రోజులుగా మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచేశారు. ఈ హృదయవిదారక ఘటన సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలో జరిగింది. -
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. -
కొత్తవలసలోని జిందాల్ పరిశ్రమ మూసివేత
కొత్తవలస మండలంలోని మెసర్స్ జిందాల్ స్టెయిన్ లెస్ లిమిటెడ్ పరిశ్రమను యాజమాన్యం మూసివేసింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో
-
భారత వృద్ధిరేటు అంచనాలను గణనీయంగా పెంచిన ఐరాస
-
వివేకా హత్య కేసు.. నాంపల్లి కోర్టులో విచారణకు హాజరైన ఎంపీ అవినాష్రెడ్డి