Telangana News: క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలి: హైకోర్టు
క్యాసినో కేసులో ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. చీకోటి ప్రవీణ్ దరఖాస్తును
హైదరాబాద్: క్యాసినో కేసులో ఈడీ విచారణ ముగిసే వరకు తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ వినతిని పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. చీకోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలో పరిగణనలోకి తీసుకోవాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను ఆదేశించింది.
తనకు పోలీసు భద్రత కల్పించాలన్న చీకోటి ప్రవీణ్ పిటిషన్పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈడీ విచారణలో పలువురు రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టినట్టు తప్పుడు ప్రచారం జరుగుతోందని, దాని వల్ల తన కుటుంబానికి ముప్పు ఏర్పడిందని తన పిటిషన్లో పేర్కొన్నారు. తన ఇంటి వద్ద కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కోరుతూ ఈనెల 4న పోలీసులకు వినతిపత్రం సమర్పించినట్టు తెలిపారు. తనకు ముప్పు ఉందని తెలిసినప్పటికీ పోలీసులు స్పందించడం లేదన్నారు. వాదనలు విన్న హైకోర్టు చీకోటి ప్రవీణ్ దరఖాస్తును వారంలో పరిగణనలోకి తీసుకోవాలని ఆదేశిస్తూ పిటిషన్పై విచారణ ముగించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు