TS News: ఫ్రాన్స్లో కేటీఆర్ పర్యటన .. మిస్సైల్స్, ఎంబీడీఏ ప్రతినిధులతో భేటీ
ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్, మిస్సైల్ సిస్టమ్స్లో
హైదరాబాద్: ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర బృందం రెండో రోజు పలు కంపెనీల సీఈవోలు, అధిపతులతో సమావేశమైంది. మిస్సైల్, మిస్సైల్ సిస్టమ్స్లో ప్రఖ్యాతిగాంచిన పారిస్కు చెందిన ఎంబీడీఏ కంపెనీ డైరెక్టర్లు బోరిస్ సోలోమియాక్, పాల్ నీల్ లే లివెక్, ఇతర ప్రతినిధులతో సమావేశమైన కేటీఆర్.. తెలంగాణలో తయారీ రంగం అవకాశాలను వివరించారు. అవకాశాలను తెలుసుకునేందుకు రాష్ట్రంలో పర్యటించాలని ఎంబీడీఏ ప్రతినిధి బృందాన్ని ఆహ్వానించారు. ఏరో క్యాంపస్ ఆక్విటైన్ సంస్థ డైరెక్టర్ జేవియర్ ఆడియాన్, ఇతర ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఫ్రాన్స్లోని భారత రాయబారి జావెద్ ఆష్రాఫ్తో సమావేశమైన కేటీఆర్.. వివిధ రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఫ్రెంచ్ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉన్న రంగాల గురించి తెలిపారు. 800 కంపెనీలతో కూడిన కాస్మోటిక్ వ్యాలీ క్లస్టర్ డిప్యూటీ సీఈవో ఫ్రాంకీ బెచెర్యూతో సమావేశమైన మంత్రి.. భారతదేశ కాస్మోటిక్ మార్కెట్ గురించి వివరించారు. తెలంగాణలో కాస్మోటిక్స్ తయారీ అవకాశాలను వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434