Karnataka: కన్నబిడ్డను రూ.5వేలకు అమ్మేసిన తల్లి

కర్ణాటకలోని విజయపురలో ఓ మహిళ నవజాత శిశువును నర్సు ద్వారా 5 వేల

Published : 17 Sep 2021 21:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: కర్ణాటకలోని విజయపురలో ఓ మహిళ నవజాత శిశువును నర్సు ద్వారా 5 వేల రూపాయలకు అమ్మేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వచ్చి తన శిశువు కావాలని కోరింది. విషయం తెలిసిన అధికారులు నర్సును సస్పెండ్  చేయగా తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 

విజయపుర జిల్లా తికోటకు చెందిన రేణుక ఆగస్టు 19న ఓ బిడ్డకు జన్మనిచ్చింది. పోషించే స్తోమత లేదంటూ కస్తూరి అనే నర్సు ద్వారా తన బిడ్డను ఆగస్టు 26న 5వేల రూపాయలకు విక్రయించింది. కొన్ని రోజుల తర్వాత తన బిడ్డను తిరిగి ఇవ్వాలని రేణుక డిమాండ్ చేయగా, కుదరదని నర్సు తేల్చి చెప్పింది. రేణుక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అధికారులు నర్సును సస్పెండ్ చేశారు. రేణుకపై మూడు కేసులు నమోదు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని