YS Sharmila: కుమారుడి వివాహంపై షర్మిల ట్వీట్‌

తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహంపై వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) ట్వీట్‌ చేశారు.

Updated : 01 Jan 2024 14:39 IST

హైదరాబాద్‌: ఫిబ్రవరి 17న తన కుమారుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరగనున్నట్లు వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల (YS Sharmila) వెల్లడించారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. అట్లూరి ప్రియతో రాజారెడ్డికి వివాహం జరగనున్నట్లు తెలిపారు.

‘‘అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా కుమారుడు రాజారెడ్డికి అట్లూరి ప్రియతో జనవరి 18న నిశ్చితార్థ వేడుక నిర్వహించనున్నాం. ఫిబ్రవరి 17న వివాహం జరగనున్న సంగతి మీతో పంచుకోవడం ఆనందంగా ఉంది. మంగళవారం మేము కుటుంబ సమేతంగా కాబోయే వధూవరులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్‌ని సందర్శిస్తాం. తొలి ఆహ్వాన పత్రికను అక్కడ ఉంచి నాన్న ఆశీస్సులు తీసుకుంటాం’’ అని షర్మిల పేర్కొన్నారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని