హసీనాపై హత్యాయత్నం.. ఉగ్రవాదులకు మరణశిక్ష

బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను హత్యకు కుట్ర పన్నిన 14 మంది ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. 2000 ఏడాదిలో ఆమెపై జరిగిన ఉగ్రదాడి కేసులో విచారణ చేపట్టిన దాకా ట్రిబ్యునల్‌ న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు

Updated : 24 Mar 2021 00:34 IST

ఢాకా: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనాను హత్యకు కుట్ర పన్నిన 14 మంది ఇస్లామిక్‌ ఉగ్రవాదులకు అక్కడి న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. 2000 ఏడాదిలో ఆమెపై జరిగిన ఉగ్రదాడి కేసులో విచారణ చేపట్టిన దాకా ట్రిబ్యునల్‌ న్యాయస్థానం మంగళవారం ఈ మేరకు తీర్పును వెలువరించింది. ఈ కేసులో ఇప్పటికే 9 మంది జైలుశిక్ష అనుభవిస్తుండగా, మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. మిగిలిన వారు అరెస్టు, లేదా లొంగిపోయిన తర్వాత శిక్షను అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. 

2000 ఏడాదిలో గోపాల్‌గంజ్‌ జిల్లాలోని కోటలిపరలో ఎన్నికల ర్యాలీకి వెళ్లిన హసీనాపై ఉగ్రవాదులు దాడికి యత్నించారు. ‘హర్కతుల్‌ జీహాద్‌ బంగ్లాదేశ్‌’కు చెందిన ఉగ్రవాదులు బాంబులు పెట్టి ఆమెను హతమార్చాలని చూశారు. పక్కా సమాచారంతో బాంబు నిర్వీర్య బృందాలు వాటిని తొలగించడంతో దాడి నుంచి హసీనా బయటపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని