చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత

నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి ఏడు నెలలు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు నిర్వహించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది....

Updated : 26 Jun 2021 21:37 IST

ఏడు నెలలు పూర్తి చేసుకున్న రైతు ఉద్యమం

దిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేపట్టిన ఉద్యమం నేటికి ఏడు నెలలు పూర్తిచేసుకుంది. ఈ క్రమంలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిర్వహించిన ర్యాలీ చండీగఢ్-దిల్లీ సరిహద్దుల వద్ద ఉద్రిక్తతకు దారితీసింది. ట్రాక్టర్లు, ఎడ్లబండ్ల మీద పెద్దసంఖ్యలో చండీగఢ్-దిల్లీ సరిహద్దులకు చేరుకున్న రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకోవడంతో సరిహద్దుల వద్ద ఉద్రిక్తత నెలకొంది. అన్నదాతలను నిలువరించేందుకు పోలీసులు జలఫిరంగులు ప్రయోగించారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు, ముళ్ల కంచెలు ఏర్పాటు చేసినప్పటికీ రైతులు ట్రాక్టర్లతో వెళ్లేందుకు ప్రయత్నించారు.

ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా పోలీసులు కొంత మంది రైతు నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనలు ఏడు నెలలు పూర్తయిన సందర్భంగా సాగు చట్టాలను నిరసిస్తూ అన్ని రాష్ట్రాల గవర్నర్‌లకు అన్నదాతలు వినతిపత్రాలు సమర్పించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఈమేరకు ఆందోళనలు చేపట్టిన రైతులను పోలీసులు ఎక్కడికక్కడ నిలువరిస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని