రైతుల ఆందోళన: ట్రూడో వ్యాఖ్యలు అనవసరం
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో వ్యాఖ్యలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలోని
కెనడా ప్రధానిగా దీటుగా బదులిచ్చిన భారత్
దిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. ట్రూడో వ్యాఖ్యలు అసమగ్రంగా ఉన్నాయని పేర్కొంది. ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం అనవసరమంటూ కెనడాకు బదులిచ్చింది. అసలేం జరిగిందంటే..
గురునానక్ జయంతి సందర్భంగా ఓ ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న జస్టన్ ట్రూడో.. రైతుల ఆందోళనపై స్పందించారు. ‘భారత్లో రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నారనే వార్త తెలిసింది. పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా ఆలోచనంతా వారి కుటుంబసభ్యుల గురించే. శాంతియుతంగా నిరసన తెలియజేసే వారి హక్కుల పరిరక్షణకు కెనడా మద్దతు ఇస్తుందని మీకు గుర్తు చేయాలనుకుంటున్నాం. మేము చర్చల ప్రాముఖ్యతను విశ్వసిస్తాం. మా ఆందోళనను భారత అధికారుల వద్ద వ్యక్తం చేశాం. మనందరిని ఒకదగ్గర కలిపి ఉంచే క్షణం ఇది’ అని రైతులకు మద్దతు తెలిపారు. ట్రూడోతో పాటు మరికొందరు కెనడా నేతలు కూడా ఇదేవిధంగా మాట్లాడారు.
దీంతో కెనడా ప్రధాని వ్యాఖ్యలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ‘భారత్లోని రైతుల గురించి కొందరు కెనడా నేతలు అసమగ్ర వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అలాంటి వ్యాఖ్యలు అనవసరం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశంలోని అంతర్గత వ్యవహారాల్లో ఇతరుల జోక్యం ఉండకూడదు’ అని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు.
కాగా.. ట్రూడో వ్యాఖ్యలను పలు రాజకీయ పార్టీలు కూడా ఖండించాయి. ఇది తమ అంతర్గత వ్యవహారమని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేదీ అనగా.. ఇలాంటి స్పందనను ఆహ్వానించలేమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్