24 గంటల్లో 92,071 కేసులు.. 1,136 మరణాలు

భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,78,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 92,071 కేసులు వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది..........

Published : 14 Sep 2020 10:25 IST

దిల్లీ: భారత్‌లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,78,500 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 92,071 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 48,46,428కి చేరింది. వీరిలో 9,86,598 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా.. 37,80,107 మంది కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. ఇక కొత్తగా 1,136 మంది మహమ్మారికి బలయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 79,722కి పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా రికవరీ రేటు 78 శాతానికి చేరింది. మరణాల రేటు 1.64 శాతంగా ఉంది. 

ఇక ప్రపంచవ్యాప్తంగా జాన్స్‌ హాప్‌కిన్స్‌ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 28,902,170 కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,22,735 మంది మృత్యువాతపడ్డారు. 65,19,554 కేసులు, 1,94,073 మరణాలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా.. భారత్‌, బ్రెజిల్‌ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని