అమెరికా కవయిత్రికి నోబెల్
సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయీస్ గ్లక్ను వరించింది. ఈ మేరకు స్వీడన్ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయార్క్లో జన్మించిన లూయీస్.
స్టాక్హోం: సాహిత్య రంగంలో ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం అమెరికాకు చెందిన కవయిత్రి లూయిస్ గ్లక్ను వరించింది. ఈ మేరకు స్వీడన్ అకాడమీ గురువారం ప్రకటించింది. 1943లో న్యూయార్క్లో జన్మించిన లూయిస్.. కనెక్టికట్లోని యాలే యూనివర్శిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. 1968లో ఫస్ట్బార్న్ పేరుతో తొలి కవిత రాసిన లూయిస్.. కొద్ది కాలంలో అమెరికా సాహిత్యరంగంలో ప్రముఖ కవయిత్రిగా పేరుగాంచారు. తన కవితలతో ఎంతోమందిని ప్రభావితం చేసిన ఆమె.. ప్రఖ్యాత పులిట్జర్ పురస్కారం, నేషనల్ బుక్ అవార్డ్ వంటి ఎన్నో పురస్కారాలు పొందారు. లూయిస్ రాసిన ది వైల్డ్ ఐరిష్ కవితకు 1993లో పులిట్జర్ అవార్డును అందుకున్నారు.
నోబెల్ సాహిత్య పురస్కారాలపై గతంలో వివాదం చెలరేగిన విషయం తెలిసిందే. పురస్కారాల విజేతలను ఎంపిక చేసే స్వీడిష్ అకాడమీలో లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 2018లో సాహిత్య రంగంలో నోబెల్ ప్రకటనను వాయిదా వేశారు. ఆ తర్వాత గతేడాది 2018, 2019 సంవత్సరాలకు గానూ రెండు పురస్కారాలను ఒకేసారి ప్రకటించారు. 2018 ఏడాదికి గానూ పొలాండ్కు చెందిన ప్రముఖ కవయిత్రి ఓల్గాకు పురస్కారం దక్కింది. 1901 నుంచి ఇప్పటివరకు సాహిత్య రంగంలో 117 మంది నోబెల్ ఇవ్వగా.. వీరిలో మహిళలు 16 మంది ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా