రెండు టీకాలు కలిపితే..?
కరోనా టీకా సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు బ్రిటన్ యోచిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మెరుగైన సమర్థతను కనబరిచిన రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్, ఫైజర్ వ్యాకిన్లను కలిపి ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్రణాళికలు.......
ప్రయోగాలకు సిద్ధమవుతున్న బ్రిటన్
లండన్: కరోనా టీకా సామర్థ్యాన్ని మరింత పెంచే అంశాన్ని బ్రిటన్ పరిశీలిస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే మెరుగైన సమర్థతను కనబరిచిన రెండు వ్యాక్సిన్లను కలిపి ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచిస్తోంది. ఈ మేరకు ఆక్స్ఫర్డ్, ఫైజర్ వ్యాకిన్లను కలిపి ప్రయోగాలు జరపాలని పరిశోధకులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఏడాది దీనికి సంబంధించిన ప్రయోగాలు ప్రారంభిస్తామని బ్రిటన్ వ్యాక్సిన్ టాస్క్ఫోర్స్ వెల్లడించింది. దీనిపై ఇప్పటి వరకు జరిపిన ప్రాథమిక పరిశోధనకు సంబంధించిన వివరాల్ని నివేదిక రూపంలో ప్రచురించారు. తమ స్పుత్నిక్-V వ్యాక్సిన్ను ఆక్స్ఫర్డ్ టీకాతో కలిపి ప్రయోగాలు నిర్వహించాలని ఆస్ట్రాజెనెకాను రష్యా ఇటీవల కోరిన విషయం తెలిసిందే.
టీకాను ప్రజా వినియోగంలోకి తీసుకొచ్చేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ఫైజర్ టీకాకు బ్రిటన్, బహ్రైన్ అత్యవసర వినియోగం కింద అనుమతులిచ్చేశాయి. బ్రిటన్లో నేడు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. మరికొన్ని దేశాల్లోనూ ఈ టీకాలు తర్వలో ఆమోదం పొందే అవకాశాలు ఉన్నాయి. భారత్లో సీరం సంస్థ, ఫైజర్ సహా తాజాగా దేశీయంగా భారత్ బయోటెక్ తయారు చేసిన టీకా వినియోగ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.
జర్మనీకి చెందిన బయోఎన్టెక్తో కలిసి ఫైజర్ రూపొందించిన కరోనా వ్యాక్సిన్ దాదాపు 95 శాతం సమర్థతను చూపిందని సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ సంయుక్తంగా అభివృద్ధిన చేసిన టీకా ఓ రకం డోసుతో 90శాతం మేర సమర్థతో పనిచేస్తున్నట్లు తేలిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో రెండు టీకాలను కలిపితే సమర్థత ఏమైనా మెరుగవుతుందేమో పరీక్షించేందుకు సిద్ధమవుతున్నారు.
ఇవీ చదవండి..
భారత్లో టీకా: 2 వారాల్లో అనుమతులు?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?