హాట్ చాక్లెట్తో చిన్నారికి గాయాలు.. విస్తారా విమానంలో ఘటన
విమాన సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఓ ప్రయాణికురాలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల వేదికగా తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. (Vistara)
దిల్లీ: విమాన ప్రయాణంలో వేడి పానీయం(hot beverage) చిందడంతో ఓ చిన్నారి గాయపడింది. ఈ విషయంలో విస్తారా(Vistara) సంస్థ వ్యవహరించిన తీరుపై ఆ చిన్నారి తల్లి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఈ ఘటనపై ఆ సంస్థ స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఇటీవల రచనా గుప్తా అనే మహిళ తన కుమార్తెతో కలిసి దిల్లీ నుంచి ఫ్రాంక్ఫర్ట్( Delhi to Frankfurt) వెళ్లే విస్తారా విమానం ఎక్కారు. కొద్దిసేపటి తర్వాత ఆమె తన కుమార్తె కోసం హాట్ చాక్లెట్ను ఆర్డర్ చేశారు. అయితే, ఆ వేడి పానీయం పొరపాటున ఆ పాపపై పడింది. ఆ వేడికి ఆ చిన్నారి చర్మం ఎర్రగా కందిపోయింది. దీనిపై రచన ట్విటర్ వేదికగా అసహనం వ్యక్తం చేశారు. ‘ఫ్రాంక్ఫర్ట్కు వెళ్తున్న విమానంలో ఒక ఎయిర్హోస్టెస్ వల్ల మా పదేళ్ల పాపకు కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత వారి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. ఆ ఎయిర్ హోస్టెస్, సిబ్బంది మాకు కనీసం క్షమాపణ కూడా చెప్పలేదు’ అని వెల్లడించారు.
నేపాల్లో హోటల్.. యూపీలో గెస్ట్హౌస్.. ఈ దొంగ మామూలోడు కాదు
‘ప్రథమ చికిత్స అందించి, ఆ కొత్త ప్రదేశంలో మమ్మల్ని అంబులెన్స్లో పంపించేశారు. మా లగేజ్ను తరలించే విషయంలో ఎలాంటి సాయం అందలేదు. వైద్య ఖర్చులు మొత్తం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఈ ఘటన వల్ల మేం తర్వాత ఎక్కాల్సిన విమానం మిస్ అయ్యాం. ఆ విషయంలో కూడా వారు ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు’ అని తాను ఎదుర్కొన్న అనుభవాన్ని వెల్లడించారు. ఈ పోస్టు తర్వాత విమానయాన సంస్థ మమ్మల్ని సంప్రదించిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై విస్తారా(Vistara) వివరణ ఇచ్చింది.
‘ఆ దురదృష్టకర ఘటనను మేం ధ్రువీకరిస్తున్నాం. ఆ చిన్నారి తల్లిదండ్రుల కోరిక మేరకు మేం ఆ వేడి పానీయాన్ని అందించాం. సిబ్బంది దానిని సర్వ్ చేసే సమయంలో చిన్నారి కదలడంతో అనుకోకుండా అది చేజారింది. వెంటనే ఆ పాపకు ప్రథమ చికిత్స అందించాం. విమానం ఫ్రాంక్ఫర్ట్లో దిగేవరకు మా వైద్య సిబ్బంది వెంటే ఉండి పరిస్థితిని పర్యవేక్షించారు. వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి, వారిని ఆసుపత్రికి తరలించాం. అప్పటి నుంచి ప్రతిదశలో వారిని సంప్రదిస్తూనే ఉన్నాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. వైద్య ఖర్చులు చెల్లిస్తామని వారికి వెల్లడించాం. అలాగే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మా సేవలను మెరుగుపర్చుకుంటాం. వినియోగదారుల భద్రతకే మా తొలి ప్రాధాన్యత’ అని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు
-
పిఠాపురంలో మద్యం ఇవ్వలేదు.. డబ్బు పంచలేదు: మాజీ ఎమ్మెల్యే వర్మ
-
గెలిచేది కూటమే.. మెజార్టీ ఎంత?.. ఐపీఎల్ను మరిపిస్తున్న ఫలితాలు
-
క్షణక్షణం ఉత్కంఠ.. పోలింగ్ నాటి ఘటనలతో గ్రామాల్లో ఉద్రిక్తత
-
అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ దుర్మరణం: ప్రమాదం నుంచి బయటపడి.. మరో కారు ఢీకొని...!