Ajit Doval: రెండు దేశాల మధ్య నమ్మకం పోయింది..: అజిత్ డోభాల్
భారత్-చైనా సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారు.
ఇంటర్నెట్డెస్క్: 2020లో వాస్తవాధీన రేఖ వెంట చోటు చేసుకొన్న పరిణామాల కారణంగా భారత్-చైనా మధ్య వ్యూహాత్మక, ప్రజా, రాజకీయ సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య విశ్వాసం కనుమరుగైందన్నారు. దక్షిణాఫ్రికాలో జరుగుతన్న బ్రిక్స్ సమావేశంలో ఆయన చైనా అత్యున్నత దౌత్యవేత్త వాంగ్ యీతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరుదేశాల మధ్య ఇబ్బందికర పరిస్థితులను తొలగించేందుకు నిరంతరం చర్యలు చేపట్టాలని అజిత్ డోభాల్ పేర్కొన్నారు. చైనా పొలిటకల్ బ్యూరో సభ్యుడైన వాంగ్ యీ బ్రిక్స్ సమావేశాల్లో పాల్గొన్నారు. ఆ దేశ విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ దీనికి గైర్హాజరయ్యారు. చైనా తరపున వాంగ్ యీ, భారత్ తరపున అజిత్ డోభాల్ సరిహద్దు సమస్యపై చర్చించేందుకు ప్రత్యేక ప్రతినిధులుగా వ్యవహరిస్తున్నారు. ఇక బ్రిక్స్ సమావేశంలో డోభాల్ మాట్లాడుతూ సైబర్ భద్రతపై సమష్టిగా కలిసి పనిచేయాలని మిత్రదేశాలకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణకు ప్రధాని మోదీ, షీజిన్పింగ్ బాలీలో జరిగిన జీ20 సమావేశంలో అంగీకరించినట్లు చైనా విదేశాంగ శాఖ ప్రకటించిన కొద్దిసేపటికే.. డోభాల్-వాంగ్ భేటీపై భారత విదేశాంగ శాఖ ప్రకటన వెలువరించింది. దీనిలో బాలీ సదస్సు అంశం ప్రస్తావించకపోవడం గమనార్హం.
మయన్మార్ నుంచి మణిపుర్కు.. రెండు రోజుల్లో 700 మంది
మరోవైపు చైనా ప్రతినిధి వాంగ్యీ మాట్లాడుతూ.. ఇరు దేశాలు పరస్పరం వ్యూహాత్మక విశ్వాసాన్ని పెంచుకుని.. సహకారంపై దృష్టి పెట్టి అడ్డంకులను దాటాలన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలను పూర్వ స్థితికి తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. చైనా ఎప్పుడూ ఆధిపత్య ధోరణి ప్రదర్శించబోదని.. భారత్తో సహా ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని వెల్లడించారు. బహుళ ధ్రువ ప్రపంచాన్ని, అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్య ధోరణికి చైనా మద్దతు ఇచ్చేందుకు కృషి చేస్తుందన్నారు.
భారత్-చైనా సంబంధాలు కేవలం ఇరు దేశాలకే కాక.. ఈ ప్రాంతం మొత్తానికి చాలా కీలకమని వాంగ్యీ, డోభాల్ అంగీకరించారు. ఇటీవల ఇండోనేషియా రాజధాని జకార్తాలో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, వాంగ్యీ భేటీ అయ్యారు. వీరిద్దరు సరిహద్దు సమస్యపై చర్చించిన కొన్ని రోజులకే ఈ భేటీ జరగడం విశేషం. ఇరు దేశాల మధ్య సరిహద్దు వివాదం తన కెరీర్లోనే అత్యంత కఠిన సమస్యగా ఇటీవల జైశంకర్ వ్యాఖ్యానించారు. ఈ వివాదం తేలనంత వరకు ఇరు దేశాల సంబంధాలు సాధారణ స్థితికి రావడం అసాధ్యమని ఆయన స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. -
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
నష్టపరిహారం చెల్లించినప్పటికీ ప్రైవేటు ఆస్తుల స్వాధీనానికి సంబంధించి ప్రభుత్వాలు, ప్రభుత్వ విభాగాలు సరైన విధానాలు పాటించాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
వేలు తీయమంటే.. నాలుకకు శస్త్రచికిత్స చేశారు!
ఆరో వేలు తీయించేందుకు ఆసుపత్రికి తీసుకెళ్లిన చిన్నారి నాలుకకు శస్త్రచికిత్స చేసిన దారుణ సంఘటన కేరళలో చోటుచేసుకుంది. -
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర
జమ్మూకశ్మీర్లో ప్రఖ్యాత అమర్నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఆగస్టు 19 వరకు అది కొనసాగుతుంది. -
‘చీపుళ్ల’తో కష్టాలను ఊడ్చేసింది!
వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తుకొస్తుంటారు. కానీ, మేమూ ఏం తక్కువ కాదంటోంది ఓ మహిళ. అనడమే కాదు.. స్వయంకృషితో రాణిస్తూ, మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. -
కేజ్రీవాల్కు మినహాయింపులివ్వలేదు
అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై జరుగుతున్న రాజకీయ చర్చపై గురువారం సుప్రీంకోర్టు స్పష్టతనిచ్చింది. బెయిల్ విషయంలో దిల్లీ సీఎంకు తాము ఎలాంటి ప్రత్యేక మినహాయింపులు ఇవ్వలేదని తెలిపింది. -
మాలీవాల్పై దాడి ఘటనలో ఎఫ్ఐఆర్ నమోదు
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మాలీవాల్పై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు బిభవ్ కుమార్ దాడికి పాల్పడిన ఘటనపై గురువారం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. -
సీబీఐ అదనపు సంచాలకులుగా ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్
సీబీఐలో అదనపు సంచాలకులుగా సీనియర్ ఐపీఎస్ అధికారులు ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్ నియమితులయ్యారు. 1995 బ్యాచ్ అస్సాం-మేఘాలయ క్యాడర్కు చెందిన కృష్ణ ప్రస్తుతం సీఆర్పీఎఫ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. -
ప్రత్యేక కోర్టు పరిశీలనలో కేసు ఉంటే నిందితుడిని ఈడీ అరెస్టు చేయకూడదు
మనీలాండరింగ్ కేసు ప్రత్యేక కోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో నిందితుడిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేయరాదని సుప్రీంకోర్టు తెలిపింది. -
హోర్డింగ్ కూలిన ప్రాంతంలో రోడ్ షో నిర్వహించడం అమానవీయం
దేశ వాణిజ్య రాజధాని ముంబయిలో ఇటీవల ఇనుప హోర్డింగ్ కుప్పకూలి 16 మంది ప్రాణాలు కోల్పోయిన ప్రాంతం మీదుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ రోడ్ షో నిర్వహించడం అమానవీయమని శివసేన (యూబీటీ) రాజ్యసభ సభ్యుడు సంజయ్రౌత్ విమర్శించారు. -
పిడుగుపాటుకు 11 మంది దుర్మరణం
అకాల వర్షాలకు వివిధ ప్రాంతాల్లో ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పశ్చిమబెంగాల్లోని మాల్దా జిల్లా వ్యాప్తంగా గురువారం పిడుగుపాటుకు మొత్తం 11 మంది మృతిచెందినట్లు ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. -
నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను వెనక్కు పంపండి
అస్సాంలోని నిర్బంధ కేంద్రంలో మగ్గుతున్న 17 మంది విదేశీయులను విడుదల చేసి వెనక్కు పంపించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. -
రెండు రాష్ట్రాల్లో ఓబీసీ రిజర్వేషన్ల పెంపు
పంజాబ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) రిజర్వేషన్ కోటా పెంచాలని జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సీబీసీ) సిఫార్సు చేసింది. -
స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ గురువారం స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. -
దాడి ఘటనపై తొలిసారి స్పందించిన స్వాతి మాలీవాల్
తనపై ఇటీవల జరిగిన దాడి ఘటనపై ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్ ఎక్స్(ట్విటర్) వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా
-
తల్లి నుంచే కుమారుడికి ‘టీఈఎక్స్13బి’.. ఆ జన్యువు లోపిస్తే పురుషుల్లో సంతానలేమి
-
పిన్నెల్లి సోదరులను జైలుకు పంపాలి.. ఘర్షణలకు వారే కారణం: మాజీ మంత్రి నక్కా ఆనందబాబు