Biden: ‘తీవ్ర పరిణామాలు తప్పవు’.. పుతిన్ను హెచ్చరించిన బైడెన్ !
అమెరికా-రష్యా మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం మాట్లాడుతూ.. ఉక్రెయిన్ ఆక్రమించేందుకు
ఇంటర్నెట్డెస్క్: అమెరికా-రష్యాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ శనివారం మాట్లాడుతూ.. ఉక్రెయిన్ను ఆక్రమించేందుకు రష్యా యత్నిస్తే భారీ మూల్యం చెల్లించేలా ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఆయన విలేకర్లతో మాట్లాడుతూ ఉక్రెయిన్ రక్షణ కోసం అమెరికా పదాతి దళాలను పంపించే ప్రతిపాదన ఏమీ లేదన్నారు. నాటో దేశాల్లోని తూర్పు సరిహద్దుల రక్షణ కోసం అదనపు బలగాలను పంపాల్సి ఉందన్నారు. ‘‘నేను ఈ విషయాన్ని పుతిన్కు స్పష్టంగా వెల్లడించాలనుకున్నాను. ఒక వేళ ఉక్రెయిన్పైకి రష్యా దళాలు వెళితే.. ఆతర్వాత భయంకరమైన ఆర్థిక ఆంక్షలు ఖాయం’’ అని వ్యాఖ్యానించారు.
గత వారం పుతిన్-బైడెన్ దాదాపు రెండు గంటలపాటు ఫోన్కాల్లో మాట్లాడుకొన్నారు. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ ఉక్రెయిన్పై దాడి చేస్తే ప్రపంచం అనూహ్యంగా మారిపోతుందని హెచ్చరించారు. శనివారం జీ-7 విదేశాంగ మంత్రులు కూడా ఇటువంటి హెచ్చరికనే జారీ చేశారు. వీరు నిన్న లివర్పూల్లో సమావేశమైన విషయం తెలిసిందే. రేపు జీ-7 దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా రష్యాపై ఆంక్షల విషయాన్ని కూడా చర్చించనున్నారు.
► Read latest National - International News and Telugu News
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?