
Toilet Scam: శివసేన ఎంపీ సంజయ్ రౌత్పై రూ.100కోట్ల పరువునష్టం దావా
ముంబయి: శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్పై రూ.100కోట్లకు పరువునష్టం దావా దాఖలైంది. భాజపా నేత కిరీట్ సోమయ్య భార్య, ప్రొఫెసర్ మేధా బాంబె హైకోర్టులో ఈ దావా దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టాయిలెట్ స్కామ్ (Toilet Scam) పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తదుపరి కథనాలు ఆపడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డాక్టర్ మేధా తన పిటిషన్లో పేర్కొన్నారు.
మహారాష్ట్ర భాజపా నేత కిరీట్ సోమయ్య కుటుంబ సభ్యులు ఓ స్వచ్ఛంద సంస్థను నడిపిస్తున్నారు. అయితే, బాంబె శివారులోని మీరా భయందర్ మున్సిపల్ కార్పొరేషన్లో రూ.100కోట్ల టాయిలెట్ స్కామ్ (Toilet Scam) జరిగిందని ఆరోపిస్తూ శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వరుస కథనాలు వచ్చాయి. అంతకుముందు కూడా సోమయ్య కుటుంబీకులు నడిపిస్తోన్న స్వచ్ఛంద సంస్థకు ఇందులో భాగస్వామ్యం ఉందని సంజయ్ రౌత్ ఆరోపణలు చేశారు. అనంతరం ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఇతర మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, వీటిని ఖండించిన కిరీట్ సోమయ్య సతీమణి ప్రొఫెసర్ మేధా.. ఎటువంటి ఆధారాలు లేకుండానే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తన గౌరవానికి భంగం కలిగించే ఉద్దేశంతోనే అటువంటి వార్తలు ప్రచారం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
ఇక మీడియాలో వచ్చిన కథనాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రొఫెసర్ మేధా గత నెలలో పోలీసులను ఆశ్రయించారు. తాజాగా న్యాయపరంగా ముందుకు వెళ్లిన ఆమె.. మీడియాలో వస్తోన్న వార్తలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని చెబుతూ బాంబే హైకోర్టులో దావా వేశారు. ఇందులో భాగంగా తనకు రూ.100కోట్ల మేరకు నష్ట పరిహారం పొందే అర్హత ఉందని.. వాటి సీఎం రిలీఫ్ ఫండ్లో జమచేసేలా ఆదేశాలు ఇవ్వాలని పేర్కొన్నారు. అంతేకాకుండా తన పరువుకు నష్టం కలిగించినందున క్షమాపణలు చెప్పడంతో పాటు వ్యక్తిగతంగా తనకు భంగం కలిగించే కథనాలను ప్రచురించకుండా ఆదేశాలు ఇవ్వాలని తన పిటిషన్ ద్వారా కోర్టుకు డాక్టర్ మేధా విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs ENG: ఇంగ్లాండ్తో మ్యాచ్కు వర్షం అడ్డంకి.. భారత్ రెండు వికెట్లు డౌన్
-
Business News
Gold: దిగుమతి సుంకం ఎఫెక్ట్.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
Politics News
Revanth Reddy: ప్రాజెక్టుల పేరుతో అరాచకాలా?: సీఎం కేసీఆర్కు రేవంత్ బహిరంగ లేఖ
-
Politics News
Telangana News: భాజపా, కాంగ్రెస్ శ్రేణులపై లాఠీఛార్జి.. హనుమకొండలో ఉద్రిక్తత
-
Business News
Hero motocorp: ‘హీరో’ ట్రేడ్ మార్క్ వ్యవహారం.. హీరో మోటోకార్ప్కు ఊరట
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- TS TET Results: తెలంగాణ టెట్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్ కోసం క్లిక్ చేయండి..
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? ( 01-07-2022)
- Salmonella: ‘సాల్మొనెల్లా’ కలకలం.. ప్రపంచంలోనే అతిపెద్ద చాక్లెట్ ప్లాంట్లో ఉత్పత్తి నిలిపివేత!
- Uddhav thackeray: ఉద్ధవ్ లెక్క తప్పిందెక్కడ?
- Tollywood movies: ఏంటి బాసూ.. ఇలాంటి మూవీ తీశావ్..!
- Meena: అలా ఎంత ప్రయత్నించినా సాగర్ను కాపాడుకోలేకపోయాం: కళా మాస్టర్
- ఈ మార్పులు.. నేటి నుంచి అమల్లోకి..
- Nupur Sharma: నుపుర్ శర్మ దేశానికి క్షమాపణలు చెప్పాలి
- Andhra News: రూ.వందల కోట్ల ఆర్థిక మాయ!
- Income Tax Rules: జులై 1 నుంచి అమల్లోకి రాబోతున్న 3 పన్ను నియమాలు..