DCGI: 18 ఫార్మా కంపెనీల లైసెన్స్లు రద్దు చేసిన కేంద్రం
దేశవ్యాప్తంగా 18 ఫార్మా కంపెనీల లైసెన్స్ల(Pharma Companies)ను కేంద్రం రద్దు చేసింది. గత 15 రోజులుగా 20 రాష్ట్రాల్లో పలు ఫార్మా సంస్థల్లో తనిఖీలు నిర్వహించిన డీసీజీఐ(DCGI), నిబంధనలు పాటించని సంస్థలపై చర్యలు చేపట్టింది.
దిల్లీ: మార్గదర్శకాలను పాటించకుండా నాసిరకం మందులను తయారు చేస్తోన్న 18 ఫార్మా సంస్థల (Pharma Companies) అనుమతులను కేంద్రం రద్దు చేసింది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి (DCGI) మంగళవారం ప్రకటించింది. ఏయే సంస్థల లైసెన్స్లు రద్దు చేశారనే వివరాలు తెలియాల్సివుంది. గత 15 రోజులుగా 20 రాష్ట్రాల్లో పలు ఫార్మా సంస్థల్లో డీసీజీఐ తనిఖీలు నిర్వహించింది. వీటిలో 18 ఫార్మా కంపెనీలను తక్షణం మందుల తయారీని నిలిపివేయాలని ఆదేశించింది. మిగిలిన కంపెనీలపై చర్యలకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటిలో హిమాచల్ ప్రదేశ్లో 70 కంపెనీలు, ఉత్తరాఖండ్లో 45, మధ్యప్రదేశ్లో 23 కంపెనీలు ఉన్నాయని తెలిపింది. మరోవైపు అనుమతులు లేకుండా ఆన్లైన్లో మందులు విక్రయిస్తున్న ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
గతేడాది గాంబియా, ఉజ్బెకిస్థాన్లలో భారత్కు చెందిన ఫార్మాకంపెనీలు తయారు చేసిన సిరప్లు వాడి పలువురు చిన్నారులు మృత్యువాతపడ్డారు. వీటిపై విచారణ జరిపిన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆ మందులను నాసిరకమైనవిగా నిర్ధారించింది. గత నెలలో గుజరాత్కు చెందిన ఔషధ తయారీ కంపెనీ అమెరికాకు సరఫరా చేసిన 55 వేల సీసాల జనరిక్ ఔషధాలను వెనక్కి రప్పించింది. అంతకుముందు అమెరికా వైద్యారోగ్య శాఖ అభ్యంతరాలు తెలపడంతో చైన్నై కేంద్రంగా పనిచేస్తున్న ఫార్మా కంపెనీ కంటి మందు తయారీని నిలిపివేసింది. ఈ వరుస ఘటనల నేపథ్యంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదేశాలతో డీసీజీఐ బృందాలు పలు రాష్ట్రాల్లోని ఫార్మా సంస్థల్లో తనిఖీలు నిర్వహించాయి. ఆయా సంస్థలు ఉత్పత్తి చేస్తోన్న ఔషధాలను కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CSDSCO) పరీక్షించి రూపొందించిన నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టినట్లు సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.