ఎన్నికల తర్వాతే వద్దామనుకున్నా.. కానీ: ట్రంప్
రాష్ట్రపతి భవన్లో విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత పర్యటనకు రావాలనుకున్నానని...........
దిల్లీ: రాష్ట్రపతి భవన్లో విందు సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాతే భారత పర్యటనకు రావాలనుకున్నానని.. కానీ, మోదీకి తన ఆలోచన నచ్చలేదని చెప్పారు. అందుకే ఇప్పుడే వచ్చేశానని తెలిపారు. ‘‘ నేను ప్రధాని మోదీకి కాల్ చేసి.. అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత వస్తే మీకేమైనా అభ్యంతరమా అని అడిగాను. ఆయన నా ఆలోచనను ఇష్టపడలేదు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి భవన్లో విందు ఆరగించే ముందు మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రోజుల భారత పర్యటన అద్భుతంగా సాగిందన్నారు. విమానంలో ప్రయాణించిన 18 గంటల సమయాన్ని తాను లెక్కగట్టడం లేదన్నారు. ఎందుకంటే తనకు ఇష్టమైన ప్రాంతానికి రాబోతున్న ప్రయాణ సమయం తనకు భారంగా అనిపించలేదని వ్యాఖ్యానించారు.
భారత్ను, ఇక్కడి ప్రజలను తాను ఎంతగానో ప్రేమిస్తానని ట్రంప్ పునరుద్ఘాటించారు. గత ఏడాది టెక్సాస్లో జరిగిన ‘హౌడీ-మోదీ’ కార్యక్రమాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. అమెరికా ప్రజలు ఇంకా ఆ సభ గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. మోతెరా స్టేడియంలో జరిగిన ‘నమస్తే ట్రంప్’ సభ అత్యద్భుతంగా సాగిందన్నారు. లక్షా 25 వేల మంది హాజరుకావడం మరచిపోలేని అనుభూతినిచ్చిందన్నారు. ఇంకా వేలాది మంది స్టేడియం వెలుపల వేచి చూసినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. రోడ్డుకిరువైపులా వేలాది మంది ప్రజలు తనకు స్వాగతం పలికిన తీరు తనను అబ్బుపరిచిందన్నారు. చివరిసారిగా మోదీ, రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మరోసారి తప్పకుండా భారత్కు వస్తాం.. మిమ్మల్ని అందరినీ మిస్ అవుతున్నాం’’ అంటూ భారత్ పర్యటనను ముగించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మద్యం కుంభకోణం ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే
దిల్లీ మద్యం విధానం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి, కుట్రదారు ముఖ్యమంత్రి కేజ్రీవాలేనని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. -
రష్యా నుంచి సురక్షితంగా స్వదేశానికి 10 మంది భారతీయులు
రష్యా సైన్యంలో సహాయక సిబ్బందిగా పనిచేస్తున్న భారతీయుల్లో 10 మంది సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. -
‘మనీ లాండరింగ్’ బూచిని చూపి రూ.25 కోట్లకు టోకరా
మనీ లాండరింగ్ కేసును బూచిగా చూపిన సైబర్ నేరగాళ్లు ముంబయిలో ఉండే ఓ బహుళజాతి కంపెనీ (ఎంఎన్సీ) విశ్రాంత మహిళా డైరెక్టర్ను సుమారు రూ.25 కోట్ల మేర మోసగించారు. -
స్త్రీ ధనంపై భర్తకు నియంత్రణ ఉండదు: సుప్రీం
భార్యకు చెందిన స్త్రీ ధనం (మహిళా ఆస్తి)పై భర్తకు ఎటువంటి నియంత్రణ ఉండదని సుప్రీంకోర్టు పునరుద్ఘాటించింది. -
వాట్సప్లో కేసుల లిస్టింగ్ సమాచారం
డిజిటైజేషన్ దిశగా సుప్రీంకోర్టు మరో ముందడుగు వేయనుంది. ఈ మేరకు త్వరలో కేసులకు సంబంధించిన సమాచారాన్ని సంబంధిత న్యాయవాదులకు వాట్సప్ సందేశాల రూపంలో పంపించనున్నారు. -
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.