చైనా వంచన విధానమే ప్రపంచాన్ని ముంచింది!
ప్రపంచ సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారికి చైనానే పూర్తి జవాబుదారీగా ఉండాలని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ...
కరోనా మహమ్మారికి చైనానే జవాబుదారీ
అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అమెరికా అధ్యక్షుడు
డ్రాగన్ దేశంపై మరోసారి విరుచుకుపడ్డ ట్రంప్
వాషింగ్టన్: ప్రపంచ సంక్షోభానికి కారణమైన కరోనా వైరస్ మహమ్మారికి చైనానే పూర్తి జవాబుదారీగా ఉండాలని అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. చైనా రహస్య, వంచన విధానాలే కరోనా వైరస్ ప్రపంచమంతా వ్యాపించడానికి కారణమయ్యాయని ఆ దేశంపై విరుచుకుపడ్డారు. అమెరికా 244వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించిన డొనాల్డ్ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
'దేశంలో చైనా వైరస్ ప్రవేశించినంతవరకూ అమెరికా గొప్పగా పనిచేసింది. ఇదివరకు మాస్కులు, గౌన్లు, శస్త్రచికిత్సా పరికరాలను విదేశాలనుంచి దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా చైనా నుంచే దిగుమతి ఎక్కువగా ఉండేది. కానీ, ప్రస్తుతం అవన్నీ అమెరికానే స్వయంగా ఉత్పత్తి చేస్తోంది' అని అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు. మహమ్మారిని ఎదుర్కోవడంలో భాగంగా వ్యాక్సిన్, ఔషధాల కోసం అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తోన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. అంతేకాకుండా ఈ సంవత్సరం చివరినాటికే అమెరికాలో కొవిడ్కు చికిత్సా లేదా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా అమెరికా శాస్త్రసాంకేతిక నైపుణ్యాలను డొనాల్డ్ ట్రంప్ మరోసారి కొనియాడారు.
ఇవీ చదవండి..
కరోనా..అది చైనా ప్లేగు!
ప్రపంచంలో మూడో స్థానానికి భారత్
ఆగస్టు 15నాటికి కరోనా వ్యాక్సిన్?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం సవరించాలంటే భారత్ను వీడతాం
సమాచార దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు అమలు చేస్తున్న తన ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్ విధానాన్ని సవరించాలని బలవంత పెడితే తాము భారత్లో సేవలను నిలిపివేస్తామంటూ వాట్సప్ సంచలన వ్యాఖ్యలు చేసింది. -
ఈవీఎంలపై సుప్రీం తీర్పు విపక్షాలకు గట్టి చెంపదెబ్బ
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంలు)పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమికి గట్టి చెంపదెబ్బ. -
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
ఏడాదికి రెండు సార్లు సీబీఎస్ఈ పరీక్షలు నిర్వహించేందుకు సీబీఎస్ఈ రంగం సిద్ధం చేస్తోంది. బోర్డు పరీక్షల్లో సెమిస్టర్ విధానం తీసుకొచ్చే ఆలోచన లేదని సమాచారం.
తాజా వార్తలు (Latest News)
-
ఈ చిట్టితల్లికి కష్టమొచ్చింది!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?